ముత్యాలపల్లిలో సచివాలయం, ఆర్బీకే భవనాలకు బ్రేక్
ABN , First Publish Date - 2021-10-20T04:51:20+05:30 IST
ముత్యాలపల్లిలో సచివాలయం, ఆర్బీకే సెంటర్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది.
హైకోర్టు తీర్పుతో నిలిచిపోయిన భవనాల నిర్మాణం
మొగల్తూరు,అక్టోబరు 19 : ముత్యాలపల్లిలో సచివాలయం, ఆర్బీకే సెంటర్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. గ్రామంలోని ఆర్ఎస్ నెంబర్ 74–3లో గల భూమిని మందబయలు భూమిగా కేటాయించింది. అయితే ప్రభుత్వం అదే స్థలంలో సచివాలయం, ఆర్బీకె సెంటర్ల నిర్మాణానికి తలపెట్టడంతో గ్రామానికి చెందిన కొల్లాటి ఏడుకొండలు హైకోర్టును ఆశ్రయించాడు.ఈ భూమి 24 సెంట్లు డీకె పట్టాలుగా తమకు కేటాయించిందని పేర్కొన్నారు.ఈ మేరకు జడ్జి పశువు లకు కేటాయించిన భూమిలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించరాదని ఆ భూమి ని పశువుల మేతకే వినియోగించుకోవాలని తీర్పు ఇవ్వడంతో ముత్యాలపల్లిలో నిర్మాణాలకు బ్రేక్ పడింది. కొల్లాటి ఏడుకొండలు తీరుపై హర్షం వ్యక్తం చేశారు.