6 రోజుల ర్యాలీకి బ్రేక్‌

ABN , First Publish Date - 2022-08-05T06:11:33+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఆరు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలను శుక్రవారం

6 రోజుల ర్యాలీకి బ్రేక్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఆరు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించనున్న నేపథ్యంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు  బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇంధన రంగ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. రూపాయి పతనం మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచింది. దాంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ గురువారం 51.73 పాయింట్లు తగ్గి 58,298.80 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 6.15 పాయింట్ల నష్టంతో 17,382 వద్ద క్లోజైంది.

Updated Date - 2022-08-05T06:11:33+05:30 IST