బ్రెజిల్ కరోనా విలయం.. అధ్యక్షుడి భార్యకు కరోనా పరీక్షలు!

ABN , First Publish Date - 2020-07-13T02:58:14+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. బ్రెజిల్‌లోనూ ఈ మమమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కాగా.. మహమ్మారిని తేలికగా తీసుకున్న బ్రెజిల్ అధ్య

బ్రెజిల్ కరోనా విలయం.. అధ్యక్షుడి భార్యకు కరోనా పరీక్షలు!

బ్రెజిల్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. బ్రెజిల్‌లోనూ ఈ మమమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కాగా.. మహమ్మారిని తేలికగా తీసుకున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మంగళవారం రోజు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు.. జైర్ బోల్సొనారో భార్య మిచెల్ బోల్సొనారోతో సహా ఇద్దరు కూతుళ్లకు కరోనా పరీక్షలు చేశారు. అయితే అందులో వారికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని మిచెల్ బోల్సొనారో కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. బ్రెజిల్‌లో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బ్రెజిల్‌లో నిన్న ఒక్కరోజే 36వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో బ్రెజిల్‌లో ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య 18.40లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 70వేలు దాటింది. కాగా.. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. 


Updated Date - 2020-07-13T02:58:14+05:30 IST