బ్రెజిల్లో విజృంభిస్తున్న కరోనా!
ABN , First Publish Date - 2021-03-05T11:18:40+05:30 IST
బ్రెజిల్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుం
న్యూఢిల్లీ: బ్రెజిల్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతోపాటు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో బ్రెజిల్లోని కొన్ని ముఖ్య నగరాల్లో ఆంక్షలు తిరిగి అమలులోకి వచ్చాయి. బ్రెజిల్ రెండవ అతిపెద్ద నగరమైన రియో డి జనీరోలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి నైట్ కర్ఫ్యూని విధిస్తున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా వ్యాపార సముదాయాలపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించారు. బ్రెజిల్ రాజధానిలో కూడా కొద్ది రోజుల క్రితమే కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. వరల్డ్ఒమిటర్.ఇన్ఫోలోని సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో బ్రెజిల్లో దాదాపు 75వేల కరోనా కేసులు నమోదవ్వగా.. సుమారు 1,840 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ నమోదైన కేసుల సంఖ్య 1.7కోట్లకు చేరింది. ఇదే సమయంలో మరణాల సంఖ్య 2.59లక్షల ప్రాణాలు కోల్పోయారు.