Visakha: బ్రాండిక్స్ గ్యాస్ లీక్ ఘటన విచారణలో పురోగతి
ABN , First Publish Date - 2022-06-07T15:59:27+05:30 IST
బ్రాండిక్స్ గ్యాస్ లీక్ ఘటన విచారణలో పురోగతి లభించింది.
విశాఖపట్నం: బ్రాండిక్స్ గ్యాస్ లీక్ ఘటన విచారణలో పురోగతి లభించింది. జిల్లాలోని రాంబిల్లి మండలం, కొత్తూరు పాలెంలో ఉన్న పోరస్ లేబరేటరీ, ప్రొడక్షన్ నిలిపివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. బ్రాండిక్స్ కంపెనీలో వెలువడిన విషవాయువు మొదట ఈ కంపెనీ నుండి వచ్చిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోరస్ కంపెనీపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చర్యలు తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కార్యకలాపాలు నిలిపేయాలని బోర్డ్ నోటీసులు ఇచ్చింది.