అనారోగ్యంతో బాలుడు బ్రెయిన్‌డెడ్‌

ABN , First Publish Date - 2021-07-23T04:26:49+05:30 IST

భద్రాచలానికి చెందిన ఓ బాలుడికి బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అతడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.

అనారోగ్యంతో బాలుడు బ్రెయిన్‌డెడ్‌
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సిద్ధు

అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు

భద్రాచలం, జూలై 21: భద్రాచలానికి చెందిన ఓ బాలుడికి బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అతడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. భద్రాచలం పట్టణానికి చెందిన డాక్టర్‌ భాను ప్రసాద్‌-సీత అనే వారికి సంతానం లేకపోవడంతో 10మంది అనాథలను పెంచుకుంటున్నారు. వారిలో నాలుగోవాడైన  సిద్ధు(13) అనారోగ్యంతో బాధప డుతూ హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందతూ ‘బ్రెయిన్‌డెడ్‌’ అయ్యాడు. దీంతో బాలుడి అవ యవాలను కుటుంబ సభ్యుల అంగీకారంతో గురువారం అవసరమైన వారికి దానం చేశారు. భద్రాచలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సిద్దూ ఆరో తరగతి చదువు తున్నా డు. అతడిని దత్తత తీసుకొని పెంచుతున్న తండ్రి డాక్టర్‌ భానుప్రసాద్‌ భద్రాచలంలో వైద్యుడిగా సేవలంది స్తున్నాడు. 


Updated Date - 2021-07-23T04:26:49+05:30 IST