వైభవంగా బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-10-19T05:41:29+05:30 IST
సిరిసిల్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పద్మావతి అమ్మవారు ఆండాలమ్మ రూపంలో సొమవారం భక్తులకు దర్శనమిచ్చారు.
సిరిసిల్ల ఎడ్యుకేషన్, అక్టోబరు 18: సిరిసిల్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పద్మావతి అమ్మవారు ఆండాలమ్మ రూపంలో సొమవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమం నిర్వహించారు. పద్మశాలీల ఆడపడచుగా భావించే అమ్మవారికి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఒడిబియ్యంతోపాటు పట్టువస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్ పత్తిపాక పద్మ శంకర్, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, ఆలయ అధ్యక్షుడు ఉప్పుల విఠల్రెడ్డి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, కార్యవర్గ సభ్యులు, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్ ఆలయ ధర్మకర్తలు కోడం శ్రీనివాస్, మేర్గు లక్ష్మణ్, మామిడాల రమణ, అల్లాడి సరస్వతి, కత్తెర సంతోషిణి తదితరులు పాల్గొన్నారు.