సౌమ్యనాథునికి చక్రస్నానం

ABN , First Publish Date - 2021-07-26T05:19:05+05:30 IST

శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామి చక్రస్నానం ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం సౌమ్యనాథస్వామి గ్రామోత్సవం వసంతోత్సవాల నడుమ జరిగింది. ఆలయంలో ఉత్సవమూర్తులకు సుగంధ పరిమళ

సౌమ్యనాథునికి చక్రస్నానం
సౌమ్యనాథుడిని చక్రస్నానానికి తీసుకెళుతున్న దృశ్యం

ముగిసిన బ్రహ్మోత్సవాలు

నందలూరు, జూలై 25: శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామి చక్రస్నానం ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం సౌమ్యనాథస్వామి గ్రామోత్సవం వసంతోత్సవాల నడుమ జరిగింది. ఆలయంలో ఉత్సవమూర్తులకు సుగంధ పరిమళ గంధం, పాలు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫలములతో అభిషేకం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆగమశాస్త్ర పండితులు కోనేటిలో చక్రస్నానం నిర్వహించారు. కార్యక్రమంలో బ్రహ్మోత్సవ అధ్యక్ష, కార్యదర్శులు మేడా విజయభాస్కర్‌రెడ్డి, మేడా విజయశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌, సర్పంచ జంబు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-26T05:19:05+05:30 IST