నేటినుంచి జమలాపురంలో బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-13T05:50:05+05:30 IST

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్దిగాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈనెల 13వతేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయని ఈవో జగన్మోహన్‌రావు, చైర్మన్‌ ఉప్పల కృష్ణమోహన్‌శర్మ తెలిపారు

నేటినుంచి జమలాపురంలో బ్రహ్మోత్సవాలు

ఎర్రుపాలెం, ఏప్రిల్‌ 12: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్దిగాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈనెల 13వతేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయని ఈవో జగన్మోహన్‌రావు, చైర్మన్‌ ఉప్పల కృష్ణమోహన్‌శర్మ తెలిపారు. సోమవారం ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 13వతేదీ నుంచి 21వతేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివా్‌సశర్మ, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు విజయకుమారి, సోమయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T05:50:05+05:30 IST