బ్రాహ్మణులు ఐకమత్యంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-10-25T05:37:33+05:30 IST

బ్రాహ్మణులు అందరూ కలిసి మెలసి అహం విడనాడి ఐకమత్యంగా ఉన్నప్పుడే అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని పరుశురామ బ్రాహ్మణసంఘం జాతీయ అధ్యక్షుడు పంచాంగం మధుసుధనశాస్ర్తి పేర్కొన్నారు.

బ్రాహ్మణులు ఐకమత్యంగా ఉండాలి
నాగప్రసాద్‌శర్మను సన్మానిస్తున్న బ్రాహ్మణులు

పెనుకొండ, అక్టోబరు 24: బ్రాహ్మణులు అందరూ  కలిసి మెలసి అహం విడనాడి ఐకమత్యంగా ఉన్నప్పుడే అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని పరుశురామ బ్రాహ్మణసంఘం జాతీయ అధ్యక్షుడు పంచాంగం మధుసుధనశాస్ర్తి పేర్కొన్నారు. ఆదివారం బ్రాహ్మణ సంఘం సమావేశ భవనంలో పౌరోహిత్యంలో వేద పండితులుగా విశేష సేవలు అందించిన వేద బ్రహ్మ డాక్టర్‌ పంచాంగం నాగప్రసాద్‌శర్మకు పరుశురాం బ్రాహ్మణ సేవా సంఘం ఆద్వర్యంలో పురోహిత నిఘంటువు బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెనుకొండ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామ్మోహన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పరుశురాం బ్రాహ్మణ సంఘం జాతీయ అధ్యక్షులు మధుసుధనశాస్ర్తి, రాష్ట్ర అధికారప్రతినిధి పంచరత్నం సురే్‌షశర్మ, వర్కింగ్‌ అధ్యక్షులు సత్యనారాయణప్రసాద్‌, పెనుకొండ ఉపాధ్యక్షులు పాలూరి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శులు శేఖర్‌ శర్మ, రఘునాథ్‌శాస్ర్తి, సుబ్రమణ్యశాిస్ర్తి, మహే్‌షశర్మ, తదితరులు హాజరై బ్రాహ్మణ సంఘం విధులు, బాధ్యతలు చేపట్టే కార్యక్రమాల గురించి వివరించారు. 


Updated Date - 2021-10-25T05:37:33+05:30 IST