కళ్లు ప్రధానమైనవి : నటుడు బ్రహ్మానందం
ABN , First Publish Date - 2020-10-02T08:16:02+05:30 IST
అన్ని అవయవాల్లో కళ్లు ప్రదానమైనవని, కంటిచూపు లేకపోతే బతుకు దుర్భరంగా ఉంటుం దని ప్రముఖ
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 1 (ఆంధ్రజ్యోతి): అన్ని అవయవాల్లో కళ్లు ప్రదానమైనవని, కంటిచూపు లేకపోతే బతుకు దుర్భరంగా ఉంటుం దని ప్రముఖ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం అన్నారు. ‘కార్నియా అంధత్వ ముక్త్ భారత్ అభియాన్’కు సహకారం తెలుపుతూ ‘సక్షమ్ సేవా’ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నేత్రదానంపై అవగాహన కల్పించారు. ‘జీతే జీతే రక్తదాన్’ ‘జాతే జాతే నేత్రదాన్’ నినాదంతో ప్రారంభించిన కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవం తం చేయాలన్నారు. బతికి ఉండగా రక్తదానం, చనిపోయినప్పుడు నేత్రదానం చేయాలన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.