బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2020-11-30T05:46:16+05:30 IST

బ్రాహ్మణుల సంక్షేమానికి తన సహ కారం ఎప్పుడూ ఉంటుందని దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
బ్రాహ్మణ అన్నదాన సత్రాన్ని ప్రారంభిస్తున్న బూచేపల్లి


మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి 

తాళ్లూరు, నవంబరు 29 : బ్రాహ్మణుల సంక్షేమానికి తన సహ కారం ఎప్పుడూ ఉంటుందని దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. గుంటిగంగ సన్నిధిలో మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో నూ తనంగా నిర్మించిన శ్రీ గుం టిగంగాభవానీ బ్రాహ్మణ అన్నదాన సత్రాన్ని బూచేపల్లి, ప్రముఖ వైద్యుడు, సంఘసేవకుడు బందా జవహర్‌ ఆది వారం ప్రారంభించారు. ఈ సందర్భం గా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ  స త్రం అధ్యక్షురాలు వై.టి.లక్ష్మీసుందరి  దాతల సహకారంతో అన్నదాన సత్రాన్ని నిర్మించి అందులో బూచేపల్లి కుటుంబాన్ని కూడా భాగస్వాములను చేయడం ఆనందంగా ఉందన్నారు.  కార్తీక పౌర్ణమి సం ద ర్భంగా సత్య వ్రతాలు నిర్వహించారు. కార్యక్రమంలో యేల్చూరి రా మకోటేశ్వరావు, శ్రీలక్ష్మి, చలువాది బదరీనారాయణ, ఎన్‌ దీక్షితులు, ఫణికుమార్‌,ఆర్‌వై కోటేశ్వరరావు, పీ.వీ.నరసింహారావు, వి.వెంకటేశ్వరి, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, డి వీరంగారావు, వైఎస్‌ఆర్‌కెప్రసాద్‌, వై.మోహన్‌రావు, ఆర్‌ ఎల్‌ నరసింహారావు, దర్శి ఏఎంసీ చైర్మన్‌ వై.వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూధన్‌రెడ్డి, కోటరామిరెడ్డి, జి. మోషే పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T05:46:16+05:30 IST