తినడానికి ఏదైనా తీసుకొస్తా ఇక్కడే ఉండు అంటూ ప్రేయసిని రైల్వే స్టేషన్లోనే ఉంచి వెళ్లిన ప్రియుడు.. ఊహించని షాకిచ్చాడు..!

ABN , First Publish Date - 2021-12-20T01:47:07+05:30 IST

తినడానికి ఏదైనా తీసుకొస్తా నువ్వు ఇక్కడే ఉండూ అంటే.. ఆ ప్రియురాలు మురిసిపోయింది. తనపై చూపుస్తున్న ప్రేమకు సంతోషపడింది. అయితే.. అతడు ఊహించని షాకివ్వడంతో కంగుతింది. చివరికి ఏం

తినడానికి ఏదైనా తీసుకొస్తా ఇక్కడే ఉండు అంటూ ప్రేయసిని రైల్వే స్టేషన్లోనే ఉంచి వెళ్లిన ప్రియుడు.. ఊహించని షాకిచ్చాడు..!

ఇంటర్నెట్ డెస్క్: తినడానికి ఏదైనా తీసుకొస్తా నువ్వు ఇక్కడే ఉండూ అంటే.. ఆ ప్రియురాలు మురిసిపోయింది. తనపై చూపుస్తున్న ప్రేమకు సంతోషపడింది. అయితే.. అతడు ఊహించని షాకివ్వడంతో కంగుతింది. చివరికి ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే...


బిహార్‌లోని అర్వాల్ ప్రాంతానికి చెందిన 17ఏళ్ల యువతి, అదే రాష్ట్రానికి చెందిన మధుబాని ప్రాంతంలోని యువకుడితో ప్రేమలో పడింది. కొంతకాలం సరదాగా గడిపిన ఆ ఇద్దరూ.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో తమ విషయం చెబితే ఒప్పుకోరన్న ఉద్దేశంతో రహస్యంగా పెల్లి చేసుకునేందుకు యువకుడు అర్వాల్ వెళ్లి, ఈ నెల 18న ఆమెను మధుబానికి తీసుకొచ్చాడు. అనంతరం రైల్వే స్టేషన్‌లోనే ఉండమని, తినడానికి ఏదైనా తీసుకొస్తానని ఆమెకు చెప్పి, యువతి సెల్‌ఫోన్ తీసుకుని బయటికి వెళ్లాడు. అంతే.. అలా వెళ్లిన యువకుడు మళ్లీ తిరిగి రాలేదు. 


సాయంత్రం వరకూ ఆకలితో అలమటించిన యువతి.. చేతిలో డబ్బు లేకపోవడంతో తన వద్ద ఉన్న నగలను తాకట్టు పెట్టేందుకు నగల దుకాణానికి వెళ్లింది. అక్కడ ఆ నగల వ్యాపారి ఆమెను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఆభరణం తీసుకుని డబ్బు ఇవ్వకపోవడమే కాకుండా.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీంతో ఆ యువతి ఏడవటం ప్రారంభించింది. ఈ క్రమంలో స్థానికులు అక్కడకు చేరుకుని, ఆమె నగను ఆమెకు ఇప్పించారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆమెను స్టేషన్‌కు తీసికెళ్లి, జరిగిన విషయాన్ని అడిగి తెలుకున్నారు. అనంతరం.. సదరు యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, సమాచారం ఇచ్చారు. 




Updated Date - 2021-12-20T01:47:07+05:30 IST