ప్రేమించానంటే నమ్మింది.. సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్.. ముగ్గురు స్నేహితులను పిలిచి..

ABN , First Publish Date - 2021-08-02T01:33:24+05:30 IST

ప్రేమించానంటూ వెంటపడితే నిజమే అనుకుంది. కొంత కాలం తర్వాత సరే అంది. ఇద్దరూ చేయి చేయి పట్టుకొని తిరుగుతుంటే తన లోకమే మారిపోయిందని అపోహ పడింది.

ప్రేమించానంటే నమ్మింది.. సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్.. ముగ్గురు స్నేహితులను పిలిచి..

మొరాదాబాద్: ప్రేమించానంటూ వెంటపడితే నిజమే అనుకుంది. కొంత కాలం తర్వాత సరే అంది. ఇద్దరూ చేయి చేయి పట్టుకొని తిరుగుతుంటే తన లోకమే మారిపోయిందని అపోహ పడింది. ఆ తర్వాతగానీ తన చేతిలో ఉంది కట్లపాము అని ఆ అమ్మాయికి తెలియలేదు. కానీ అప్పటికే ఆసల్యం అయిపోయింది. చివరకు చావే శరణ్యం అనుకొని ఒక బ్రిడ్జిపై నుంచి దూకేసింది. అదృష్టమో దురదృష్టమో ఆమె ప్రాణాలు మిగిలాయి కానీ, నడుముల నుంచి కింది భాగంలో చలనం పోయింది. ఈ దయనీయ గాధ ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఒక యువతిది.


షాదాబ్ అనే యువకుడు ఆ యువతి వెంటపడి ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొంతకాలం హాయిగా గడిపారు. అయితే ఆమెకు తెలియకుండా యువతి అసభ్యకర చిత్రాలు తీశాడు షాదాబ్. ఆ తర్వాత ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన ముగ్గురు స్నేహితులను పిలిచి ఆమెకు పరిచయం చేశాడు. వారితో సెక్స్ చేయాలని, లేదంటే తనకు రూ.50వేలు ఇవ్వాలని బెదిరించసాగాడు. లేదంటే ఆమె అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ప్రేమించిన వాడు ఇంతలా మోసం చేయడంతో ఏం చేయాలో తెలియని ఆ యువతి.. మరణమే శరణ్యం అనుకొని ఒక వంతెన ఎక్కి కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమె నడుం దగ్గర నుంచి కింది శరీరం పారలైజ్ అయిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-08-02T01:33:24+05:30 IST