బోయిళ్లచిరువెళ్ల్లలో టీడీపీ సభ్యత్వ నమోదు
ABN , First Publish Date - 2022-08-09T02:51:44+05:30 IST
మండలంలోని బోయిళ్లచిరువెళ్ల ఎస్సీ కాలనీలో సోమవారం టీడీపీ సభ్యత్వ నమోదును చేపట్టారు. కార్యకర్తలు, నాయకులు
ఆత్మకూరు, ఆగస్టు 8: మండలంలోని బోయిళ్లచిరువెళ్ల ఎస్సీ కాలనీలో సోమవారం టీడీపీ సభ్యత్వ నమోదును చేపట్టారు. కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చండ్రా వెంకటసుబ్బానాయుడు, మాజీ సర్పంచు మంతు యానాదిరెడ్డి, స్థానిక నేతలు రావూరు నాగేశ్వరరావు, ఏసిపోగు కొండయ్య, ఏసిపోగు శంకరయ్య, బండి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.