భక్తజన సంద్రంగా బోయకొండ

ABN , First Publish Date - 2022-07-04T05:22:50+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆదివారం గంగమ్మ భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం 5 గంటల వరకు రద్దీ కొనసాగింది. సుమారు 40,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు.

భక్తజన సంద్రంగా బోయకొండ
ప్రత్యేకాలంకారంలో బోయకొండ గంగమ్మ

గంగమ్మను దర్శించుకున్న 40 వేలమంది 


సాయంత్ర 5 వరకు కొనసాగిన రద్దీ


సేవా టికెట్ల ద్వారా ఒక్క రోజే రూ.10.50 లక్షల ఆదాయం 


చౌడేపల్లె, జూలై 3: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆదివారం గంగమ్మ  భక్తులతో కిటకిటలాడింది. ఉదయం అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి ప్రీతికరమైన వేపాకు తోరణాలతో అలంకరించారు. అమ్మవారికి అభిషేకాలు చేసి,  స్వర్ణాభరణాలతో, పూలతో  అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు.  ఆషాఢ మాసం మొదటి ఆదివారం కావడం, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలిరావటంతో  క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సాధారణ రోజుల్లో అమ్మవారి దర్శనం ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుండగా భక్తుల సౌకర్యం కోసం ఉదయం 5 గంటలకే  ప్రారంభించారు. అయినా  సాయంత్రం 5 గంటల వరకు  రద్దీ కొనసాగింది. సుమారు 40,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు.  వివిధ సేవా టిక్కెట్ల ద్వారా ఒక్కరోజే రూ.10.50 లక్షల ఆదాయం సమకూరింది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్‌ శంకర్‌నారాయణ,  ఈవో చంద్రమౌళి సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.



Updated Date - 2022-07-04T05:22:50+05:30 IST