కొడుకు బాగు కోసం పరితపించిన తల్లిదండ్రులు.. వారిని తప్పుగా అర్థం చేసుకున్న కొడుకు ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..

ABN , First Publish Date - 2021-12-17T22:27:54+05:30 IST

కన్న బిడ్డ తప్పుడు దారిలో వెళుతుంటే ఏ తల్లిదండ్రులూ తట్టుకోలేరు.

కొడుకు బాగు కోసం పరితపించిన తల్లిదండ్రులు.. వారిని తప్పుగా అర్థం చేసుకున్న కొడుకు ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..

కన్న బిడ్డ తప్పుడు దారిలో వెళుతుంటే ఏ తల్లిదండ్రులూ తట్టుకోలేరు. దండించైనా సరే అతడిని సన్మార్గంలో నడిపించాలని చూస్తారు. అలా చేయడమే ఆ తల్లిదండ్రుల పాలిట శాపమైంది. తల్లిదండ్రుల మనసును అర్థం చేసుకోలేకపోయిన కుర్రాడు వారిని దారుణంగా హతమార్చాడు. గొడ్డలితో ఇద్దరినీ నరికి చంపేశాడు. రాజస్తాన్‌లోని హనుమాన్‌ఘర్‌లో ఈ ఘటన జరిగింది. 


హనుమాన్‌ఘర్‌‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు. తల్లిదండ్రులు ఎంతగా నచ్చ చెప్పినా ఆ వ్యసనం నుంచి బయటపడలేకపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆ కుర్రాడిని డీ అడిక్షన్ సెంటర్‌లో జాయిన్ చేశారు. కొన్ని రోజుల తర్వాత అక్కడ్నుంచి తప్పించుకున్న ఆ కుర్రాడు అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుని తమ ఇంటికి తీసుకెళ్లారు.


తనను మళ్లీ డీ అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తారేమోనని ఆ కుర్రాడు అనుమానం పెంచుకున్నాడు. ఆ క్రమంలో వారితో గొడవపడ్డాడు. రాత్రిపూట వారిద్దరూ నిద్ర పోతున్న సమయంలో వారిని అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి చంపాడు. తర్వాతి రోజు ఆ విషయం చుట్టుపక్కల వారికి తెలిసింది. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆ బాలుడిని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-12-17T22:27:54+05:30 IST