JBS BUSస్టేషన్లో బాలుడి కిడ్నాప్ కలకలం
ABN , First Publish Date - 2022-05-11T01:32:31+05:30 IST
JBS BUSస్టేషన్లో బాలుడి కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: ఇమ్లిబన్ బస్స్టేషన్లో బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇమ్లిబన్ బస్స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 44 నుంచి ఓ ఆగంతకుడు బాలుడిని ఎత్తుకెళ్లాడు. వారం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమారుడిని తీసుకొని హైదరాబాద్కు వచ్చింది. తన కుమారుడిని ఓ ఆగంతకుడు ఎత్తుకెళ్లినట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కిడ్నాపర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.