బాలుడి కిడ్నాప్.. చేధించిన పోలీసులు..

ABN , First Publish Date - 2020-08-04T23:00:11+05:30 IST

జిల్లాలోని భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో గల చెక్ పోస్ట్ వద్ద జరిగిన రెండు నెలల బాబు కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బాలుడి కిడ్నాప్.. చేధించిన పోలీసులు..

కామారెడ్డి : జిల్లాలోని భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో గల చెక్ పోస్ట్ వద్ద జరిగిన రెండు నెలల బాబు కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో 10 ప్రాంతాలలో సీసీ కెమెరా ఫుటేజీలను ప్రత్యేక పోలీస్ బృందాలు పరిశీలించాయి. భిక్కనూర్ టోల్ గేట్ వద్ద లభించిన ఫుటేజీలో అనుమానం ఉన్న ఆటో వివరాలను సేకరించారు. ఆటోను పట్టుకుని నేరస్తులను విచారించగా బాబు కిడ్నాప్ విషయం బయటపడింది. సంగారెడ్డిలో పద్మ అనే నేరస్తురాలి ఇంటివద్ద బాబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్ముకునేందుకు నలుగురు వ్యక్తులు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ శ్వేతారెడ్డి వెల్లడించారు. కాగా, కిడ్నాప్‌కు గురైన బాబును అతని తల్లిదండ్రులకు ఎస్పీ శ్వేతా రెడ్డి అప్పగించారు.

Updated Date - 2020-08-04T23:00:11+05:30 IST