గడ్డపారతో తల్లిని గాయపర్చిన కుమారుడు

ABN , First Publish Date - 2022-08-20T05:44:49+05:30 IST

గడ్డపారతో తల్లిని గాయపర్చిన కుమారుడు

గడ్డపారతో తల్లిని గాయపర్చిన కుమారుడు

కాటారం, ఆగస్టు 19: తల్లిపై కుమారుడు గడ్డపారతో దాడి చేసి గాయపర్చిన సంఘటన భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు..  గుమ్మళ్లపల్లికి చెందిన మహిళ కుమారుడు (13) కొన్ని నెలలుగా సైకోలా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో గడ్డపారతో పశువులను కొడుతుండగా తల్లి వారించింది. దీంతో ఆ బాలుడు తల్లిపై అదే గడ్డపారతో దాడి చేశాడు. గొంత కింద భాగంలో పొడవడంతో ఆమెకు గాయమైంది. దీంతో ఆమెను హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మహిళకు ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పారని గ్రామస్థులు తెలిపారు. గతంలోనూ బాలుడు పలువురిపై దాడి కి యత్నించినట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-20T05:44:49+05:30 IST