కిడ్నాప్ అయిన కుర్రాడి కోసం అడవుల్లో వెతుక్కున్న కుటుంబం.. అనూహ్యంగా అతను ఎక్కడ దొరికాడంటే?

ABN , First Publish Date - 2022-05-25T09:39:49+05:30 IST

సడెన్‌గా ఒక తండ్రికి కుమారుడి నుంచి ఫోన్ వచ్చింది. తనను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, అడవిలోకీ తీసుకెళ్లిపోతున్నారని చెప్పాడు. దీంతో ఆ తండ్రి కంగారు పడిపోయాడు. తనను రెండు లక్షల రూపాయలు అడుగుతున్నారని, అవి ఇవ్వకపోతే చంపేస్తామంటున్నారని కొడుకు చెప్పిన తర్వాత కాల్ కట్...

కిడ్నాప్ అయిన కుర్రాడి కోసం అడవుల్లో వెతుక్కున్న కుటుంబం..  అనూహ్యంగా అతను ఎక్కడ దొరికాడంటే?

సడెన్‌గా ఒక తండ్రికి కుమారుడి నుంచి ఫోన్ వచ్చింది. తనను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, అడవిలోకీ తీసుకెళ్లిపోతున్నారని చెప్పాడు. దీంతో ఆ తండ్రి కంగారు పడిపోయాడు. తనను రెండు లక్షల రూపాయలు అడుగుతున్నారని, అవి ఇవ్వకపోతే చంపేస్తామంటున్నారని కొడుకు చెప్పిన తర్వాత కాల్ కట్ అయింది. ఆ తర్వాత అతని ఫోన్ స్విచాఫ్ అయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. 


అనిల్ అనే కుర్రాడు కిడ్నాప్ అయినట్లు తన ఫ్యామిలీకి సమాచారం అందించాడు. దీంతో భయపడిపోయిన కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కుర్రాడిని తీసుకెళ్లినట్లు అనుమానించిన అడవులన్నీ వెతికారు. కానీ ఎలాంటి జాడ దొరకలేదు. 


అయితే పోలీసులు కుర్రాడి నెంబర్‌ను ట్రేస్ చేయగా.. శివపురిలోని ఒక హోటల్‌లో ఉన్నట్లు కనిపించింది. అక్కడకు వెళ్లి చూస్తే.. అనిల్ నిద్రపోతూ కనిపించాడు. అతన్ని పట్టుకొని ఆరా తీస్తే.. తనకు బాగా అప్పులున్నాయని, అవి తీర్చడానికి డబ్బు కోసమే ఇలా నాటకం ఆడామని తన నేరం ఒప్పేసుకున్నాడు.

Updated Date - 2022-05-25T09:39:49+05:30 IST