దేవునిపల్లి గ్రామంలో పండగ పూట విషాదం..

ABN , First Publish Date - 2021-01-15T13:06:31+05:30 IST

కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది.

దేవునిపల్లి గ్రామంలో పండగ పూట విషాదం..

కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నిశాంత్ (5) అనే చిన్నారి అదృశ్యమైంది. మధ్యాహ్నం పతంగులు ఆడుకుంటూ ఇంటి నుంచి బాలుడు వెళ్లిపోయాడు. ఇంటికి రాకపోవడంతో దేవునిపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాత్రి ఇంటి ముందర మురికి కాలువలో నిశాంత్ శవంలా కనిపించాడు. చిన్నారి మృతితో సాయి సద్గురు కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.



Updated Date - 2021-01-15T13:06:31+05:30 IST