కేవలం రూ.350 అప్పు తీర్చేందుకు స్నేహితుడిని బలి చేసిన విద్యార్థి.. ఇంతకీ అతనేం చేశాడంటే!

ABN , First Publish Date - 2022-04-10T08:38:26+05:30 IST

ఆ బాలుడు ఒక చిన్న హోటల్లో అరువు పెట్టి మొమోస్ తినేవాడు.. బాకీ రూ.350 వరకు చేరింది.. డబ్బులు చెల్లించాలని హోటల్ ఓనర్ ఒత్తిడి చేశాడు.. డబ్బులు లేకపోవడంతో ఆ బాలుడికి ఏం చేయాలో అర్థం కాలేదు.. ఆ సమయంలో ఆ బాలుడు తన స్నేహితుడి వద్ద రూ.500 నోటు...

కేవలం రూ.350 అప్పు తీర్చేందుకు స్నేహితుడిని బలి చేసిన విద్యార్థి.. ఇంతకీ అతనేం చేశాడంటే!

ఆ బాలుడు ఒక చిన్న హోటల్లో అరువు పెట్టి మొమోస్ తినేవాడు.. బాకీ రూ.350 వరకు చేరింది.. డబ్బులు చెల్లించాలని హోటల్ ఓనర్ ఒత్తిడి చేశాడు.. డబ్బులు లేకపోవడంతో ఆ బాలుడికి ఏం చేయాలో అర్థం కాలేదు.. ఆ సమయంలో ఆ బాలుడు తన స్నేహితుడి వద్ద రూ.500 నోటు చూశాడు.. దీంతో తన స్నేహితుడని గొంతు నులిమి చంపేసి, రూ.500 తీసుకుని పారిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని బండాలో ఈ దారుణం జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బండాకు చెందిన 13 ఏళ్ల బాలుడు సరుకులు కొనేందుకు రెండు వారాల కిందట దుకాణానికి వెళ్లాడు. అయితే ఆ బాలుడు ఎంతకీ తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాతి రోజు ఉదయం ఆ బాలుడి మృతదేహం ఓ కల్వర్టు వద్ద దొరికింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 


విచారణలో ఆ బాలుడు ఆ రోజు సాయంత్రం తన స్నేహితుడితో ఉన్నట్టు ప్రత్యక్ష్య సాక్ష్యులు చెప్పారు. దీంతో ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు తన నేరం అంగీకరించాడు. తను చెల్లించాల్సిన అప్పు కోసం స్నేహితుడిని హత్య చేసినట్టు చెప్పాడు. పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. 

Updated Date - 2022-04-10T08:38:26+05:30 IST