Juiceలో మత్తు మందు కలిపి చోరీ
ABN , First Publish Date - 2022-06-08T16:42:30+05:30 IST
జ్యూస్లో మత్తు మందు కలిపి బంగారు గొలుసును దొంగిలించిన ఘటన బోయినపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
- నిందితురాలి అరెస్ట్
హైదరాబాద్ సిటీ/బోయినపల్లి : జ్యూస్లో మత్తు మందు కలిపి బంగారు గొలుసును దొంగిలించిన ఘటన బోయినపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ బోయినపల్లికి చెందిన పోచమ్మ కూలీ. మంగళవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి బయట కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. జీడిమెట్ల మార్కండేయనగర్కు చెందిన సంతోషి (32) పోచమ్మ వద్దకు చేరుకుని మాయమాటలు చెప్పి మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చింది. పోచమ్మ స్పృహ కోల్పోతున్న సమయంలో మెడలోని తులం బంగారు గొలుసు, చెవిపోగులు, 10 తులాల కాళ్ళ పట్టీలు దొంగతనం చేసి పరారైంది. గంట తర్వాత కోలుకున్న పోచమ్మ స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంతోషిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.