Shocking: ట్రైన్‌లో శెనక్కాయలు అమ్ముకునే మహిళతో మాట్లాడడమే ఆ బాలిక తప్పు.. ఆ బాలిక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందంటే..

ABN , First Publish Date - 2022-08-29T22:37:23+05:30 IST

ఆ బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు రైలు ఎక్కింది.. రైలులో శెనక్కాయలు అమ్ముకునే మహిళ ఒంటరిగా ఉన్న ఈ బాలికను చూసింది.

Shocking: ట్రైన్‌లో శెనక్కాయలు అమ్ముకునే మహిళతో మాట్లాడడమే ఆ బాలిక తప్పు.. ఆ బాలిక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందంటే..

ఆ బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు రైలు ఎక్కింది.. రైలులో శెనక్కాయలు అమ్ముకునే మహిళ ఒంటరిగా ఉన్న ఈ బాలికను చూసింది.. ఆమెతో మాటలు కలిపింది.. తన ఇంటికి తీసుకెళ్లింది.. మూడు నెలల పాటు ఆ బాలికను తన ఇంట్లో బంధించింది.. ఆ తర్వాత ఆ బాలికను రూ.30 వేలకు మరొక మహిళకు అమ్మేసింది.. ఆమె మరికొద్ది రోజుల తర్వాత మరొకరికి లక్ష రూపాయలకు అమ్మేసింది.. ఎన్నో కష్టాలు పడి ఆమె చివరకు వారి బారి నుంచి తప్పించుకుంది. మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Marriage: పొదల చాటున కూర్చున్న ప్రేమ జంటను పట్టుకున్న స్థానికులు.. రక్తంతో అమ్మాయికి బొట్టు పెట్టిన అబ్బాయి.. చివరకు..


`దాదాపు 4 సంవత్సరాల క్రితం, సాగర్‌లోని మా అమ్మమ్మ ఇంటికి నేను ఒంటరిగా రైలులో బయలుదేరాను. సాగర్ స్టేషన్‌లో దిగాను. రైలులో నాకు మమత అనే వేరుశెనగకాయలు అమ్మే మహిళతో పరిచయమైంది. మమత నన్ను తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మమత నన్ను దాదాపు 3 నెలలు బంధించింది. ఆ తర్వాత శారద అనే మహిళకు 30 వేల రూపాయలకు అమ్మేసింది. ఆమె నన్ను పెళ్లి పేరుతో ఓ వ్యక్తికి రూ.లక్షకు విక్రయించింది. అలా నేను రెండుసార్లు అమ్ముడుపోయాను. తిరిగి శారద నన్ను తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ ఇద్దరు నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఫలితంగా నేను గర్భవతినయ్యాను. ఇప్పుడు నా కూతురికి మూడు నెలలు` అని ఆమె చెప్పింది.


15 ఏళ్ల వయసులో ఆ బాలిక అపహరణకు గురైంది. ప్రస్తుతం ఆమె వయసు 19 సంవత్సరాలు. కాగా, ఆ బాలిక గురించి ఆమె తల్లిదండ్రులు నాలుగేళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. ఇటీవల మహిళా పోలీసులు శారద ఇంటి మీద దాడి చేసి అక్కడ చిక్కుకుపోయిన యువతలను రక్షించారు. అలా ఆ యువతి ఆ చెర నుంచి బయటపడింది. ఆమెను పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు. నిందితులందరినీ అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-08-29T22:37:23+05:30 IST