Bosta Satyanarayana: పోలవరం ఆలస్యానికి చంద్రబాబునే కారణం
ABN , First Publish Date - 2022-07-29T04:14:28+05:30 IST
పోలవరం ఆలస్యానికి చంద్రబాబునే కారణమని మంత్రి బొత్స అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. పోలవరం....
అమరావతి: పోలవరం (polavaram) ఆలస్యానికి చంద్రబాబు (Chandrababu)నే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ (bosta satyanarayana) అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు (Chandrababu) తాకట్టు పెట్టారన్నారు. పోలవరం నిధులు ఎలా తెచ్చుకోవాలో జగన్కు తెలుసన్నారు. రాజధాని రైతులకు న్యాయం జరుగుతుందని మంత్రి బొత్స పేర్కొన్నారు. రాజకీయ దురుద్ధేశాలతోనే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్నారు. ఆరు జిల్లాలపైనే వరద ప్రభావం ఉందని..వరదల్లో ఏడుగురు మృతి చెందారని వెల్లడించారు. వరద బాధితులకు రూ.2వేలు చొప్పున సాయం అందిస్తున్నామని బొత్స గుర్తు చేశారు.