బొత్సకు అమరావతిపై కనీస విషయ పరిజ్ఞానం లేదు: పువ్వాడ

ABN , First Publish Date - 2021-08-29T20:19:11+05:30 IST

రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ అవాకులు, చవాకులు మాట్లాడితే అమరావతి రైతులు ఊరుకోరని అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ హెచ్చరించారు.

బొత్సకు అమరావతిపై కనీస విషయ పరిజ్ఞానం లేదు: పువ్వాడ

అమరావతి: రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ అవాకులు, చవాకులు మాట్లాడితే అమరావతి రైతులు ఊరుకోరని అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బొత్స తన పదవి పోతుందనే ఈ వ్యాఖ్యలు చేశారని, ఆయనకు అమరావతిపై కనీస విషయ పరిజ్ఞానం లేదని సుధాకర్ తప్పుబట్టారు. రైతుల ఉద్యమాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాల్సింది పోయి తమపై మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి బొత్స వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పువ్వాడ సుధాకర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-29T20:19:11+05:30 IST