బొత్స త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా: రఘురామ
ABN , First Publish Date - 2021-09-15T23:15:24+05:30 IST
మంత్రి బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.
ఢిల్లీ: మంత్రి బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. బొత్స కూడా హైదరాబాద్లోని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని తెలిపారు. సీపీఐ నారాయణ ఈ మధ్య ప్రజా సమస్యలు పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. నారాయణ బిగ్బాస్ హౌస్ను బ్రోతల్ అనడం మంచిది కాదని తప్పుబట్టారు. బిగ్బాస్ హౌస్లో ఉన్న 10 మంది సుఖం గురించి కాకుండా ప్రజల కష్టాల గురించి ఆలోచించాలన్నారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సజ్జనార్ లాంటి పోలీసు అధికారులు ఏపీకి అవసరమని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. రాష్టంలో ఎవరిని పడితే వారిని డెప్యుటేషన్పై తీసుకురాకుండా మంచి అధికారులను నియమించాలని రఘురామ సూచించారు.
‘‘సినిమా టిక్కెట్లు ఆన్లైన్లో అమ్ముతారు. కంప్యూటర్ ఆపరేటర్ని నియమిస్తారా? సినిమా వ్యాపారం ఐదారు వందల కోట్లు కూడా ఉండదు. ఆంధ్ర లైలా కాలేజ్లో ఎంతోమంది గొప్పవాళ్ళు చదువుకున్నారు. అక్కడ కూడా చెత్త రూల్స్ పెడుతున్నారు. ప్రభుత్వమే అన్ని చూసుకుంటామంటోంది. జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది’’ అని రఘురామకృష్ణరాజు విమర్శించారు.