రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లే
ABN , First Publish Date - 2022-08-14T05:06:08+05:30 IST
రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లే
- జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్
వికారాబాద్, ఆగస్టు 13: రాజీపడితే ఇద్దరు గెలిచినట్లేనని వికారాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె. సుదర్శన్ తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చిన్న చిన్న విషయాలను పంతాలకు పోయి కేసులు పెట్టుకుని ఇబ్బంది పడుతున్న వారు రాజీ కుదుర్చుకునేందుకు ఈ లోక్ అదాలత్ గొప్ప అవకాశమని తెలిపారు. తెలంగాణలో నిర్వహించిన లోక్అదాలత్లో వికారాబాద్ జిల్లా 16వ స్థానంలో నిలిచిందన్నారు. జాతీయ లోక్అదాలత్లో భాగంగా జిల్లా కోర్టులో 1,311 కేసులు రాజీ పడడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్లు శంకర్, శ్రీదేవి, శ్రీకాంత్, పీపీలు రాజేశ్వర్, నమీన బేగం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.