జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి బొత్స సమీక్ష

ABN , First Publish Date - 2021-10-17T01:04:20+05:30 IST

పైడితల్లి ఉత్సవాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి బొత్స సత్యనారాయరణ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18 వ తేదీన తొలేళ్ల ఉత్సవం జరుగుతుందన్నారు.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి బొత్స సమీక్ష

విజయనగరం: పైడితల్లి ఉత్సవాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18 వ తేదీన తొలేళ్ల ఉత్సవం జరుగుతుందన్నారు.  19న సిరిమానోత్సవానికి రేపటిలోగా ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. కరోనా నిబంధనలను అనుసరించి సిరిమానోత్సవంకి ఎవరినీ అనుమతించటం లేదన్నారు. ఉత్సవాలు ఆంక్షల నడుమ జరుగుతాయని పేర్కొన్నారు. తొలేళ్ల ఉత్సవం నాడు ఉచిత దర్శనాలు కూడా ఉంటాయన్నారు. 

Updated Date - 2021-10-17T01:04:20+05:30 IST