‘కరోనా టెస్టులు చేయకపోతే పాజిటివ్ కేసులు ఎలా బయటపడతాయి?’

ABN , First Publish Date - 2020-04-01T18:02:40+05:30 IST

‘కరోనా టెస్టులు చేయకపోతే పాజిటివ్ కేసులు ఎలా బయటపడతాయి?’

‘కరోనా టెస్టులు చేయకపోతే పాజిటివ్ కేసులు ఎలా బయటపడతాయి?’

అమరావతి: ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విమర్శలకు సమయం కాదు ఇది..రాజకీయాలను పక్కన పెట్టాలని ఆయన సూచించారు. మేము పబ్లిసిటీలో వెనుకబడి ఉన్నాము..సీఎం జగన్‌కు పబ్లిసిటీ అవసరం లేదన్నారు. సంక్షోభ సమయంలో ప్రజలకు మేలు జరిగితే చాలన్నారు. చిన్న చిన్న సంఘటనలను చంద్రబాబు భూతద్దంలో చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలతో చంద్రబాబులా హడావిడి చేయడం తమకు అలవాటు లేదని విమర్శించారు. కరోనా టెస్టులు చేయకపోతే పాజిటివ్ కేసులు ఎలా బయటపడతాయి? అని ప్రశ్నించారు. తమపై ఆరోపణలు చేసిన వారికి కూడా కరోనా టెస్టులు చేయిస్తామన్నారు. 

Updated Date - 2020-04-01T18:02:40+05:30 IST