విశాఖ శంకుస్థాపనకు మోదీని ఆహ్వానిస్తాం: మంత్రి బొత్స
ABN , First Publish Date - 2020-08-02T01:37:02+05:30 IST
పరిపాలనా రాజధాని విశాఖ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని ..
హైదరాబాద్: పరిపాలనా రాజధాని విశాఖ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని మంత్రి బొత్స తెలిపారు. మూడు రాజధానుల బిల్లుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ రాజముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో డిబేట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫోన్ లైన్ ద్వారా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. త్వరలోనే విశాఖలో పరిపాలన ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అమరావతిని తరలించమని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు. ఏపీ విభజన తర్వాత రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశంపై టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టలేదని మంత్రి బొత్స పేర్కొన్నారు.