తెలుగునేల ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: బొత్స

ABN , First Publish Date - 2021-12-04T17:35:23+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీర్చలేని లోటు అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

తెలుగునేల ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: బొత్స

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీర్చలేని లోటు అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో తెలుగునేల ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. నిరాండబరుడు, నిగర్వి అయిన రోశయ్య లేని లోటు తీర్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు బొత్స తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2021-12-04T17:35:23+05:30 IST