ప్రజారాజ్యం పెట్టిననాటి నుంచి పవన్‌ చొక్కాలు చింపుతున్నారు: బొత్స

ABN , First Publish Date - 2021-10-02T00:41:44+05:30 IST

ప్రజారాజ్యం పెట్టిననాటి నుంచి పవన్‌ చొక్కాలు చింపుతున్నారు: బొత్స

ప్రజారాజ్యం పెట్టిననాటి నుంచి పవన్‌ చొక్కాలు చింపుతున్నారు: బొత్స

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. పవన్‌ 15 ఏళ్లుగా ఏం తేల్చాడని, ఏం సాధించాడు? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ప్రజారాజ్యం పెట్టిననాటి నుంచి పవన్‌ చొక్కాలు చింపుతున్నాడని బొత్స ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ఎన్ని చిరిగిపోయాయో? అంటూ మంత్రి బొత్స కామెంట్స్ చేశారు.


అనంతరం మీడియాతో బొత్స పలు విషయాలు మాట్లాడారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 'క్లీన్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు. చెత్త సేకరించే వాహనాలను బెంజి సర్కిల్‌లో సీఎం జగన్ ప్రారంభిస్తారని బొత్స పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో చెత్త సేకరణకు 3,097 ఆటోలు, 1771 ఈ-ఆటోస్, సుమారు 38 వేల మంది శానిటరీ వర్కర్లు ఈ కార్యక్రమంలో నిరంతరం పని చేస్తారని మంత్రి చెప్పారు.

Updated Date - 2021-10-02T00:41:44+05:30 IST