టీడీపీకి విధానాలు, కార్యక్రమాలు లేవు: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2022-03-07T18:07:07+05:30 IST

తెలుగుదేశం పార్టీకి విధానాలు, కార్యక్రమాలంటూ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

టీడీపీకి విధానాలు, కార్యక్రమాలు లేవు: మంత్రి బొత్స

అమరావతి: తెలుగుదేశం పార్టీకి విధానాలు, కార్యక్రమాలంటూ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారని, ప్రజల గురించి ఆలోచించరని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ పట్టించుకోదని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలు అంగీకరించరని మంత్రి అన్నారు. చట్టాలు చేసే అధికారం శాసనసభకు ఉందని.. ఆ అధికారం లేదని చెప్పడం సరికాదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-07T18:07:07+05:30 IST