బాలికలను తర్వాతి తరం రోల్ మోడల్స్గా తీర్చిదిద్దేందుకు.. ‘బోర్న్ టు షైన్’ స్కాలర్షిప్స్
ABN , First Publish Date - 2022-05-15T01:04:05+05:30 IST
ప్రతిభావంతులైన వర్ధమాన బాల కళాకారుల లాంచ్ ప్యాడ్ అయిన ‘బోర్న్ టు షైన్’ కార్యక్రమంలో గివ్ ఇండియా, జీ సీఎస్ఆర్
ముంబై: ప్రతిభావంతులైన వర్ధమాన బాల కళాకారుల లాంచ్ ప్యాడ్ అయిన ‘బోర్న్ టు షైన్’ కార్యక్రమంలో గివ్ ఇండియా, జీ సీఎస్ఆర్ చేతులు కలిపాయి. భారతీయ కళారూపాల్లో యువత నైపుణ్యాన్ని గుర్తించడంతోపాటు వారు రాణించేందుకు ఉపకార వేతనాలు అందించి ప్రోత్సహించాలని నిర్ణయించాయి. భారతీయ కళారూపాలన పునరుద్ధణకు ఇదో ప్రయత్నమే కాకుండా ఉపకార వేతనాలు అందించడం ద్వారా బాలికలకు స్వయం సాధికారత అందించడమే తమ లక్ష్యమని గివ్ ఇండియా, జీ సీఎస్ఆర్ పేర్కొన్నాయి.
దేశంలో అపారమైన టాలెంట్ ఉందని, అయితే అత్యంత అరుదుగా మాత్రమే వారు బయటకు వస్తున్నారని పేర్కొన్నాయి. ‘బోర్న్ టు షైన్’ ద్వారా అడ్డంకులను అధిగమించడంతోపాటు దేశంలో తర్వాతి తరం రోల్మోడల్స్గా ఎదగాలనే ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు యువతకు సాయపడాలన్నదే తమ లక్ష్యమని తెలిపాయి.
ఈ సందర్భంగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. బోర్న్ టు షైన్ చూపించే చొరవ ద్వారా చైల్డ్ ఆర్ట్ ప్రొడిజీల ప్రపంచంలో భారీ మార్పును తీసుకొచ్చేందుకు సాయపడుతుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. వారు రాణించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఒక బ్రాండ్గా శ్రేష్టమైనది అందించేందుకు తాము ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటామని అన్నారు.
దరఖాస్తు ఇలా..
ఏదైనా ఆర్ట్ ఫామ్లో మాస్టరీ సాధించి, 15 ఏళ్ల లోపు బాలికలు ఈ బోర్న్ టు షైన్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి మూడేళ్లపాటు స్కాలర్షిప్ అందిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఆరు వారాలపాటు అందుబాటులో ఉంటుంది. అన్ని భాషలు, భౌగోళిక ప్రాంతాల వారికి కూడా అందుబాటులో ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత టాప్ 30లో నిలిచిన వారికి ఈ స్కాలర్షిప్ లభిస్తుంది. మాస్ట్రో హోదాను సాధించేందుకు ఈ ఉపకారవేతనం వారికి అందుతుంది. వర్చువల్, భౌతిక ఫార్మాట్లలో వీరిని ఎంపిక చేస్తారు.