పంజాబ్ జీవితాన్ని మార్చాలంటే అలా చేయండి: కాంగ్రెస్ నేత
ABN , First Publish Date - 2021-11-21T00:33:50+05:30 IST
పంజాబ్ జీవితాన్ని మార్చాలంటే అలా చేయండి: కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సరిహద్దు వాణిజ్యం కోసం పాకిస్థాన్ సరిహద్దును తెరవాలని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం అన్నారు. పంజాబ్ ప్రయోజనాల కోసం సరిహద్దులను తెరవాలని తాను అభ్యర్థిస్తున్నానని సిద్ధూ పేర్కొన్నారు. మొత్తం 2,100 కిలోమీటర్లు ముంద్రా పోర్ట్ నుంచి ఎందుకు వెళ్లాలి?, ఇక్కడ నుంచి (కర్తార్పూర్ కారిడార్) ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి పాకిస్థాన్ కేవలం 21 కిలోమీటర్లు ఉంటుందని ఆయన అన్నారు.