రేపు సరిహద్దు చెక్‌పోస్టు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-06-07T13:20:24+05:30 IST

రేపు సరిహద్దు చెక్‌పోస్టు ఎత్తివేత

రేపు సరిహద్దు చెక్‌పోస్టు ఎత్తివేత

నల్గొండ/కోదాడ : రాష్ట్ర సరిహద్దుగా ఉన్న మండలంలోని నల్లబండగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద  మూడు నెలల క్రితం ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఈనెల 8వ తేదీన ఎత్తివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌లో ఆంక్షల సడలింపు తర్వాత ట్రాన్స్‌పోర్టు వాహనాలతో పాటు అన్ని వాహనాలకు ప్రభుత్వం అనుమతులివ్వడంతో పెద్దఎత్తున ఇరురాష్ర్టాలకు వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి.  రాష్ర్టాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ఆదేశాలు పాటిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చెక్‌పోస్టు ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-06-07T13:20:24+05:30 IST