ఉద్యోగులు మానసిక వత్తిడికి గురవుతున్నారు: boppa raju

ABN , First Publish Date - 2022-04-23T17:41:01+05:30 IST

రెవెన్యూ సిబ్బందికి సంబంధం లేని పనులు కూడా తమతో చేయిస్తున్నారని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. శనివారం

ఉద్యోగులు మానసిక వత్తిడికి గురవుతున్నారు: boppa raju

ప్రకాశం: రెవెన్యూ సిబ్బందికి సంబంధం లేని పనులు కూడా తమతో చేయిస్తున్నారని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... హౌసింగ్ నిర్మాణ పనులకు కూడా రెవెన్యూ ఉద్యోగులను బాధ్యులను చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రెవెన్యూ పనులన్నీ ఆన్‌లైన్‌లో చేయమంటున్నారని.... కానీ సర్వర్లు నెలలు తరబడి పని చేయడం లేదని ఆయన తెలిపారు. అర్థరాత్రులు మాత్రమే సర్వర్లు  పని చేస్తున్నాయన్నారు. సర్వర్ సమస్యలకు ఉద్యోగులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. ఉద్యోగులు మానసిక వత్తిడికి గురవుతున్నారని తెలిపారు. రోజుకొక సాఫ్ట్‌వేరు తీసుకు వస్తున్నారని... కొత్త సాఫ్ట్‌వేర్‌పై ఉద్యోగులకు శిక్షణ కూడా ఇవ్వడం లేదన్నారు. కరెంట్ బిల్లులు కట్టడం లేదని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని బొప్పరాజు వెల్లడించారు..


Updated Date - 2022-04-23T17:41:01+05:30 IST