Chennaiలో ఫోన్ చేస్తే వృద్ధులకు బూస్టర్ డోస్
ABN , First Publish Date - 2022-01-11T14:30:04+05:30 IST
రాజధాని నగరం చెన్నైలో అరవైయేళ్లు పైబడిన వృద్ధులకు ఇళ్ల వద్దే బూస్టర్ డోస్ వేయనున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ గగన్దీప్ సింగ్ బేదీ తెలిపారు. అరవైయేళ్లు దాటిన వృద్ధులు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన 1913 టోల్ఫ్రీ
చెన్నై: రాజధాని నగరం చెన్నైలో అరవైయేళ్లు పైబడిన వృద్ధులకు ఇళ్ల వద్దే బూస్టర్ డోస్ వేయనున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ గగన్దీప్ సింగ్ బేదీ తెలిపారు. అరవైయేళ్లు దాటిన వృద్ధులు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన 1913 టోల్ఫ్రీ నెంబర్కులేదా 044-25384520, 044-46122300 నెంబర్లకు ఫోన్ చేస్తే ఆరోగ్యశాఖ కార్యకర్తలు వారిళ్ల వద్దకే వెళ్ళి టీకాలు వేస్తారని ఈ సదు పాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.