‘తేజస్’ ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ వినూత్న కానుక!

ABN , First Publish Date - 2021-08-30T16:48:05+05:30 IST

సాధారణంగా బర్త్‌డే పార్టీలను ఇళ్లలోను, హోటళ్లలోను...

‘తేజస్’ ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ వినూత్న కానుక!

న్యూఢిల్లీ: సాధారణంగా బర్త్‌డే పార్టీలను ఇళ్లలోను, హోటళ్లలోను లేదా ఫంక్షన్ హాళ్లలో చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే...అయితే నడుస్తున్న రైలులో బర్త్‌డే పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అద్భుతంగా ఉంటుంది కదా! ఇప్పుడు ఈ అవకాశాన్ని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ప్రయాణికులకు కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. 


తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవారు ఈ అవకాశాన్ని అందుకోవచ్చు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్న వారి వివరాలు ఐఆర్సీటీసీకి అందుతాయి. దీనిలో ప్రయాణికుల బర్త్ డే వివరాలు ఉంటాయి. దీనిప్రకారం తేజస్ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది ప్రయాణికుల బర్త్ డేను సెలబ్రేట్ చేస్తారు. కాగా కరోనా సెకెండ్‌వేవ్ తరువాత తేజస్ ఎక్స్‌ప్రెస్ సేవలు ఆగస్టు 6 నుంచి తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఐఆర్సీటీసీ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తాజాగా లక్నో-ఢిల్లీ తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆరతి మిశ్రా, అంకుర్ శుక్లాలు తమ పిల్లలతోపాటు బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Updated Date - 2021-08-30T16:48:05+05:30 IST