తూర్పు ఏజెన్సీలో బయటపడ్డ బూబీ ట్రాప్‌లు

ABN , First Publish Date - 2021-11-09T23:42:16+05:30 IST

తూర్పు ఏజెన్సీ చింతూరు మండలంలోని అటవీప్రాంతంలో బూబీ ట్రాప్‌లను

తూర్పు ఏజెన్సీలో బయటపడ్డ బూబీ ట్రాప్‌లు

రాజమండ్రి: తూర్పు ఏజెన్సీ చింతూరు మండలంలోని అటవీప్రాంతంలో బూబీ ట్రాప్‌లను పోలీసులు కనుగొన్నారు. చింతూరు మండలం మల్లంపేట సమీపంలో ఆంధ్రా చత్తీస్‌గఢ్ సరిహద్దులో కూంబింగ్ పార్టీలు లక్ష్యంగా బూబీ ట్రాప్‌లను మావోయిస్టులు ఏర్పాటు చేసారు. సకాలంలో పోలీసులు ఏడు ట్రాప్‌లను కనిపెట్టి నిర్వీర్యం చేసారు. అటవీ ప్రాంతంలో బూబీట్రాప్‌ల వలన పోలీసులకు మాత్రమే కాకుండా ఆదివాసీలు సైతం గాయపడతారని పోలీసులు పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-09T23:42:16+05:30 IST