అమ్మోరికి బోనం

ABN , First Publish Date - 2022-08-19T05:05:53+05:30 IST

ఆమనగల్లులో గురువారం పెద్దమ్మ, పోచమ్మ బోనాలు

అమ్మోరికి బోనం
ఆమనగల్లులో బోనం కుండలతో మహిళలు

ఆమనగల్లు, ఆగస్టు 18: ఆమనగల్లులో గురువారం పెద్దమ్మ, పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుక అంబరాన్నంటింది. మహిళలు బోనాలతో ర్యాలీగా ఆలయానికి చేరుకొని అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి, ఎన్‌బీసీ మాజీసభ్యుడు తల్లోజు ఆచారి, ఆమనగల్లు మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ తోట గిరియాదవ్‌, చైర్మన్‌ నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, కౌన్సిలర్‌ బైకని యాదమ్మ, సీఐ జాల ఉపేందర్‌, తోట బుచ్చయ్య, బైకని శ్రీశైలం యాదవ్‌, జెనిగల గిరి, కృష్ణయ్య, రాములు, మల్లేశ్‌, వెంకటేశ్‌, జంగయ్య, రాములు, వెంకటయ్య, ఆనంద్‌, కృష్ణ, రాజు, మల్లేశ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


కందుకూరు మండలంలో.. 

కందుకూరు, ఆగష్టు 18 : మండలంలోని కందుకూరు, మీర్కాన్‌పేట, దెబ్బడగూడ, రాచులూరు గ్రామాలలో గురువారం పోచమ్మ, మైసమ్మ అమ్మవార్లకు ఘనంగా బోనాల పండగను జరుపుకున్నారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఎస్‌.శమంతకమణి, ఏనుగు శ్రావణి, బి.జ్యోతి, శ్రీనివాసచారి బోనాల ఉత్సవాలకు ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, ఎంపీటీసీలు కాకి రాములు, బాల్‌రాజ్‌ పాల్గొన్నారు.


చౌదర్‌పల్లిలో..

యాచారం, ఆగస్టు 18 : యాచారం మండలం చౌదర్‌పల్లి గ్రామంలో గురువారం పెద్దమ్మతల్లి బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. 



Updated Date - 2022-08-19T05:05:53+05:30 IST