సాగర్‌ ఏరియా ఆస్పత్రిలో ఎముకల ఆపరేషన

ABN , First Publish Date - 2022-05-21T06:29:43+05:30 IST

నాగార్జునసాగర్‌ కమలా నెహ్రూ ప్రభుత్వ ఏ రియా ఆస్పత్రిలో అ త్యాధునిక పరికరాల తో ఎముకల ఆపరేషన్లు ప్రారంభమైన ట్లు ఆస్పత్రి సీఎంవో డాక్టర్‌ భానుప్రసాద్‌నాయక్‌ తెలిపారు.

సాగర్‌ ఏరియా ఆస్పత్రిలో ఎముకల ఆపరేషన
మల్టీ ఫ్రాక్చర్‌ ఆపరేషన చేసిన మంగ్యాతో వైద్యులు

 మల్టీ ఫ్రాక్చర్‌ ఆపరేషన విజయవంతం 

నాగార్జునసాగర్‌, మే 20: నాగార్జునసాగర్‌ కమలా నెహ్రూ ప్రభుత్వ ఏ రియా ఆస్పత్రిలో అ త్యాధునిక పరికరాల తో ఎముకల ఆపరేషన్లు ప్రారంభమైన ట్లు ఆస్పత్రి సీఎంవో డాక్టర్‌ భానుప్రసాద్‌నాయక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ఎముక ల ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దవూర మండంల పాల్తీ తండాకు చెందిన పాల్తీ మంగ్యా అనే వ్యక్తిని అతని కుమారుడు కొట్టడంతో రెండు కాళ్లు, కుడి చేయి, త లకు గాయాలయ్యాయి. అంతే కాకుండా రెండు కాళ్లకు, చేతికి ఎనిమిది చోట్ల ఎముకలు విరిగాయి. దీంతో సదరు వ్యక్తికి ఎముకల వైద్య నిపుణులు డాక్టర్‌ రవికుమార్‌, హరికృష్ణలు రెండు గంటలు శ్రమించి మల్టీ ప్యాక్చర్‌ ఆపరేషన పూర్తి చేసినట్లు వివరించారు. ఈ ఆపరేషనలో వ్యక్తికి చోట్ల రాడ్లు, మరో రెండు ఎముకలు ప్లేట్‌లు వేసి  స్ర్కూలు బిగించారని పేర్కొన్నారు. సాగర్‌ ఏ రియా ఆసుపత్రిలో చేసే ఎముకల ఆపరేషన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 


Updated Date - 2022-05-21T06:29:43+05:30 IST