ఇన్సైడర్ ట్రేడింగ్ ఒక బోగస్: బొండా ఉమా
ABN , First Publish Date - 2020-09-27T01:59:59+05:30 IST
వైసీపీ సర్కార్ చెబుతున్న ఇన్సైడర్ ట్రేడింగ్ అంతా ఒక బోగస్ అని
అమరావతి : వైసీపీ సర్కార్ చెబుతున్న ఇన్సైడర్ ట్రేడింగ్ అంతా ఒక బోగస్ అని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన.. 16 నెలల్లో అమరావతిపై వేసిన ఏ కమిటీ ఏం తేల్చలేకపోయిందని మరోసారి చెప్పుకొచ్చారు. ఏమీ తేల్చలేకే టీడీపీ నేతలపై వ్యక్తిగతంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని బొండా ఆరోపించారు.
దమ్మాలపాటి 2011 నుంచి జగన్ అవినీతి కేసులపై వాదించారని.. 15 నెలల్లో ఈ ప్రభుత్వంపై అనేక కేసుల్లో వ్యతిరేకంగా వాదించారని చెప్పుకొచ్చారు. హిందూ దేవాలయంపై, దళితులపై దాడులు జరుగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి కేసులు, అరెస్టులు లేవని వైసీపీ సర్కార్పై బొండా ఉమా మండిపడ్డారు.