‘స్థలం ఇచ్చే అవకాశం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది..స్థలం ఎలా ఇస్తారు?’
ABN , First Publish Date - 2020-05-26T23:31:30+05:30 IST
‘స్థలం ఇచ్చే అవకాశం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది..స్థలం ఎలా ఇస్తారు?’
విజయవాడ: వైసీపీ డ్రామాలను ప్రజలు అర్ధం చేసుకోవాలని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. ‘‘గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేస్తే స్థలం ఇస్తామంటున్నారు. అమరావతిలో స్థలం ఇచ్చే అవకాశం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు స్థలమే లేకుండా పేదలకు ఎక్కడి నుంచి తెచ్చి స్థలాలు ఇస్తారు?. ప్రభుత్వం మూడు వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది. గతంలో అమరావతి పేరు చెప్పి.. సంతకాలు చేయించుకున్నారు. పేదలకు స్థలాలు ఇచ్చేందుకు ఎక్కడ సేకరించారో బహిరంగ ప్రకటన చేయాలి. అమరావతి పేరు చెప్పి స్థానిక ఎన్నికలలో లబ్ది పొందాలనుకోవడం సిగ్గు చేటు’’ అని వ్యాఖ్యానించారు.