ఛార్జ్షీట్లో పేరు లేని వ్యక్తిపై విమర్శలు చేస్తారా?: బొండా ఉమ
ABN , First Publish Date - 2022-08-10T17:32:21+05:30 IST
ఛార్జ్షీట్లో పేరు లేని వ్యక్తిపై విమర్శలు చేస్తారా?: బొండా ఉమ
గుంటూరు: ఓటుకు నోటు కేసులో ఛార్జ్షీట్లో పేరు లేని వ్యక్తిపై విమర్శలు చేస్తారా? అని టీడీపీ నేత బొండా ఉమ ప్రశ్నించారు. 18 నెలలపాటు జైలులో ఉన్న వ్యక్తిపై ఎలాంటి విమర్శలు చేయాలన్నారు. కేసులో లేని వ్యక్తి పేరు ఉన్నట్టు సజ్జల అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కేసుల్లో ఉన్న జగన్రెడ్డిపై సజ్జల ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. అంబటి రాంబాబు, అవంతి ఆడియోలు ఎందుకు పరీక్షించరు? అని ఆయన ప్రశ్నించారు. ఎంపీ గోరంట్ల మాధవ్పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్నారు. వాళ్ల ఇంట్లో వాళ్లకు ఆ వీడియోలు చూపించగలరా? అని బొండా ఉమ ప్రశ్నించారు.