చంద్రబాబు, పవన్‌ హత్యకు కుట్ర!

ABN , First Publish Date - 2022-04-08T09:31:30+05:30 IST

‘‘తన సొంత బాబాయి వివేకానందరెడ్డి గొడ్డలి వేటుకు బలైతే గుండెపోటుగా జగన్మోహన్‌రెడ్డి చిత్రీకరించారు. ఇప్పుడు ‘హైదరాబాద్‌లో ఉంటూ నన్ను విమర్శించే..

చంద్రబాబు, పవన్‌ హత్యకు కుట్ర!

జగన్‌ వ్యాఖ్యలతో అనుమానాలు: బొండా ఉమా


విజయవాడ(పాయకాపురం), ఏప్రిల్‌ 7: ‘‘తన సొంత బాబాయి వివేకానందరెడ్డి గొడ్డలి వేటుకు బలైతే గుండెపోటుగా జగన్మోహన్‌రెడ్డి చిత్రీకరించారు. ఇప్పుడు ‘హైదరాబాద్‌లో ఉంటూ నన్ను విమర్శించే వారికి గుండెపోటు వస్తుంది’ అంటూ పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. ఇది చూస్తుంటే వారి హత్యకు ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోంది. గొడ్డలివేటును గుండెపోటుగా చిత్రీకరించడంలో దిట్ట అయిన జగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిఘా సంస్థలు దీనిపై దృష్టి పెట్టాలి’’ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమ అన్నారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇప్పటి వరకు మంత్రుల రూపంలో దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుంది. మంత్రివర్గం మార్పుతో గజదొంగల ముఠా ప్రజలను పీడించబోతోంది. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడానికే మంత్రి వర్గం మార్పు. రాష్ట్రంలో జగన్‌ పాలనపై ప్రశాంత్‌ కిషోర్‌ ఇచ్చిన సర్వే ఫలితాలపై జగన్‌కు చెమటలు పడుతున్నాయి.


రాబోయే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో వైసీపీ ఉందని పీకే సర్వే రిపోర్టు స్పష్టం చేసింది. అందుకే జగన్‌ కేబినెట్‌ను మార్చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మృతుల కుటుంబాలకు చంద్రబాబు, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు జనసేని స్వంత డబ్బులు ఇచ్చారని వివరించారు. సంక్షేమ పథకాలను 95ు అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న జగన్‌ మంత్రులతో రాజీనామా చేయించడం కాదు...  అసెంబ్లీని కూడా రద్దుచేసి ఎన్నికలకు రావాలి’’ అని బొండా సవాల్‌ చేశారు. 

Updated Date - 2022-04-08T09:31:30+05:30 IST