వైసీపీ సర్కార్ను ఎప్పుడు వదిలించుకుందామా అని...: బోండా ఉమ
ABN , First Publish Date - 2022-03-13T19:02:09+05:30 IST
ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత బోండా ఉమ అన్నారు.
అమరావతి: ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత బోండా ఉమమహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్ను ఎప్పుడు వదిలించుకుందామా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వైసీపీకి ఒక్క చాన్సే ఆఖరి చాన్స్ అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు ఖాయమని బోండా ఉమ ఆశాభావం వ్యక్తం చేశారు.