డేట్, టైమ్ కొడాలి ఫిక్స్‌ చేసినా సరే.. మమ్మల్ని చేయమన్నా సరే: బోండా ఉమా

ABN , First Publish Date - 2022-01-22T17:40:41+05:30 IST

మంత్రి కొడాలి నాని వర్సెస్ టీడీపీ నేతల మధ్య అగ్గి రాజుకుంటోంది. గుడివాడ కే కన్వెన్షన్‌‌లోనే కేసినో తనది కాదని.. అది తనదేనని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని శుక్రవారం కొడాలి నాని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

డేట్, టైమ్ కొడాలి ఫిక్స్‌ చేసినా సరే.. మమ్మల్ని చేయమన్నా సరే: బోండా ఉమా

అమరావతి : మంత్రి కొడాలి నాని వర్సెస్ టీడీపీ నేతల మధ్య అగ్గి రాజుకుంటోంది. గుడివాడ కే కన్వెన్షన్‌‌లోనే కేసినో తనది కాదని.. అది తనదేనని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని శుక్రవారం కొడాలి నాని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ సవాల్‌పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని సవాల్‌కు సై అన్నారు. కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌‌లోనే కేసినో నిర్వహించారని.. తమ ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.


గుడివాడ కేసినోపై అన్ని ఆధారాలున్నాయన్నారు. తామే పెట్రోల్ డబ్బా తెస్తామన్నారు. తాము చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే తామే తగులబెట్టుకుంటామని స్పష్టం చేశారు. తాము నిరూపిస్తే మాత్రం కొడాలి నాని తగులబెట్టుకోవాలన్నారు. డేట్, టైమ్ కొడాలి ఫిక్స్‌ చేసినా సరే.. మమ్మల్ని ఫిక్స్ చేయమన్నా సరేనంటూ బోండా ఉమ సవాల్ విసిరారు. కే కన్వెన్షన్ తనిఖీకి వెళ్తే ప్రభుత్వం వణికిపోయిందన్నారు. దొరికిపోయిన దొంగ కొడాలి నాని అని బోండా ఉమా ఎద్దేవా చేశారు.



Updated Date - 2022-01-22T17:40:41+05:30 IST